Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వేగంగా వస్తున్న కారు మంగళవారం రాత్రి గోమతి నదిలో పడిన దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగర సమీపంలో గోమతి నదిలో కారు ప్రమాదవశాత్తూ పడింది. ఈ ఘటనలో ఇద్దరిని సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన మహానగర పోలీసు స్టేషన్ పరిధిలోని బైకుంథ్ థామ్ రివర్ ఫ్రంట్ వద్ద జరిగింది. రోడ్డుపై నుంచి జారి కారు నదిలో పడిపోయింది. గోమతి నదిలోని ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. దుర్ఘటన గురించి తెలియగానే లక్నో జిల్లా మెజిస్ట్రేట్, నగర స్పెషల్ పోలీసు కమిషనర్ లు కూడా వచ్చి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.