Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) మృతిచెందారు. ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రమౌళి చనిపోయారు. అతడు కోలుకునేందుకు ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది. చంద్రమౌళి మృతిని ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఆస్పత్రి ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకులు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ ప్రకటన విడుదల చేశారు. వైద్యులు శాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయిందని.. బుధవారం ఉదయం 8.30 గంటలకు చంద్రమౌళి మృతిచెందారని పేర్కొన్నారు.