Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న శ్రీవారిని 63,366 మంది భక్తులు దర్శించుకోగా 24,494 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.4 కోట్లు వచ్చిందని వెల్లడించారు.