Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో అప్రమత్తమైన కేంద్రం విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ర్యాండమ్గా కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. సమావేశం అనంతరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
భారత్లో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి. అక్టోబర్లో గుజరాత్లో గుర్తించగా ఇప్పటి వరకు గుజరాత్లో రెండు, ఒడిశాలో ఒకే కేసు నమోదైంది. వేరియంట్కు ఇంక్యుబెషన్ చాలా తక్కువ అని అధికారులు తెలిపారు. అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్లోనూ కేసులు నమోదయ్యాయి. నిఘాను పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. దేశంలో అర్హగత కలిగిన జనాభాలో 27-28 శాతం మంది మాత్రమే కొవిడ్ బూస్టర్ డోస్ తీసుకున్నారని మిగితా వారంతా తీసుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ కోరారు. ప్రజలు రద్దీ ప్రదేశాల్లో మాస్క్లు ధరించాలని వీకే పాల్ విజ్ఞప్తి చేశారు.