Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కొత్తగా 185 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,76,515కు చేరాయి. ఇందులో 4,41,42,432 మంది కోలుకున్నారు. మరో 3402 కేసులు యాక్టివ్గా ఉండగా, ఇప్పటివరకు 5,30,681 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో మహమ్మారికి ఒకరు బలయ్యారు