Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. జై తెలంగాణ అనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ఎందుకు వచ్చారని, ఆయన వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసునని అన్నారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తరుణంలో తెలంగాణ లో డిస్టర్బ్ చేయడమే వారి ముఖ్య ఉద్దేశ్యమన్నారు. చిన్న హైటెక్ సిటీ కట్టి పెద్దగా ఊహించుకుంటున్నారని, చంద్రబాబుది తెలంగాణ రాక ముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని, చంద్రబాబు పాచికలు ఇక్కడ నడవవన్నారు.