Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖంద్వా జిల్లాలో ఓ ఎనిమిదేండ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగింది. ఎనిమిదేండ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా మరో నలుగురు అక్కడికి వచ్చారు. బాలుడికి మాయ మాటలు చెప్పి ఓ రూమ్లోకి తీసుకెళ్లారు. దాంతో స్థానికంగా ఉండే మరికొందరు బాలురు దుకాణంలో ఉన్న బాలుడి తాతకు విషయం తెలుపగా ఆయన వెంటనే అక్కడికి వెళ్లి తన మనవడిని కాపాడుకున్నారు.
బాధిత బాలుడి తాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లలో ఒకనికి 18 సంవత్సరాలు ఉండగా, మరో ముగ్గురు 16 ఏండ్ల వయసు బాలురు. దాంతో పోలీసులు 18 ఏండ్ల వ్యక్తిని అరెస్ట్ చేసి, మిగతా ముగ్గురు మైనర్లను జువైనల్ కోర్టుకు తరలించారు.