Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీటీడీ ఇన్చార్జి ఈవోగా దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. కుమారుడి మృతితో ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధర్మారెడ్డి ఈనెల 22 నుంచి జనవరి రెండో తేదీ వరకూ 12 రోజుల పాటు సెలవు పెట్టారు. దీంతో ధర్మారెడ్డి రెగ్యులర్ పోస్టు అయిన అదనపు ఈవో, ఎఫ్ఏసీగా పనిచేస్తున్న ఈవో పోస్టు రెండూ తాత్కాలికంగా ఖాళీ అయ్యాయి.
ఈ తరుణంలో అనిల్కుమార్ సింఘాల్కు ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల అదనపు ఈవో పోస్టులో తిరుపతి జేఈవో వీరబ్రహ్మంను పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. జనవరి 3వ తేదీన ధర్మారెడ్డి తిరిగి విధుల్లో చేరేవరకూ ఈవో, అదనపు ఈవో పోస్టుల్లో వీరిద్దరూ పూర్తి అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తించనున్నట్లు తెలుస్తుంది.