Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు సర్వసాధారణం. మొన్నటి వరకూ కాస్త తగ్గిన బంగారం ధర.. నిన్నటి నుంచి పెరగడం ఆరంభమైంది. నిన్న బంగారం ధర రూ.540 మేర పెరిగిన విషయం తెలిసిందే. నేడు తులం బంగారంపై రూ.170 వరకూ పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో తులం బంగారం ధర రూ.45 వేల వద్ద ఉండగా.. ప్రస్తుతం తులం రూ.50 వేల మార్కును దాటేసింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.150 మేర పెరిగి రూ.50,250కి చేరగా.. 24 క్యారెట్ల ధరపై రూ.170 పెరిగి.. రూ.54,820కి చేరుకుంది.