Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం నేడు ఆటగాళ్ల వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో కేరళలోని కొచ్చిలో కొద్దిసేపటి కిందట వేలం ప్రారంభమైంది. వేలం ప్రారంభమైన కాసేపటికే ఇంగ్గాండ్ యువకిశోరం హ్యారీ బ్రూక్ ను అదిరిపోయే ధరకు కొనుగోలు చేసి సన్ రైజర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల సెంచరీల మోత మోగిస్తున్న హ్యారీ బ్రూక్ కోసం వేలంలో గట్టిపోటీ ఏర్పడగా, చివరికి రూ.13.25 కోట్లకు సన్ రైజర్స్ అతడిని తన ఖాతాలో వేసుకుంది.
అంతేకాదు,అదే ఊపులో జాతీయ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది. దీనిలో భాగంగా సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను రూ.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. అజింక్యా రహానేను రూ.50 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే ఇంగ్గాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ను, బంగ్లాదేశ్ నెంబర్ వన్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ వేలంలో ఒక్క జట్టు కొనుగోలు చేయకపోవడం విశేషం.