Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలని పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఎంపీల విజ్ఞప్తిపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సానుకూలంగా స్పందించారు. పార్టీ పేరు మార్పునకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇచ్చిన లేఖను రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు టీఆర్ఎస్ ఎంపీలు అందించారు. టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తిపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్.. టీఆర్ఎస్ ను ఇకపై బీఆర్ఎస్ గా మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లోకసభ స్పీకర్ ఓంబిర్లా స్పందిస్తూ.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎంపీలకు చెప్పారు.