Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రూ.6000కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన ఫేస్‌బుక్‌ | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Dec 23,2022

రూ.6000కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన ఫేస్‌బుక్‌

నవతెలంగాణ హైదరాబాద్: 2018లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంబ్రిడ్జి అనలిటికాకు యూజర్ల డేటాను అక్రమంగా విక్రయించిందన్న వివాదానికి ముగింపు పలికేందుకు ఫేస్‌బుక్‌ సిద్ధమైంది. ఈ కేసును పరిష్కరించుకునేందుకు 725 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.6,000 కోట్లు) చెల్లించేందుకు మాతృసంస్థ మెటా ముందుకు వచ్చింది. అయితే అందుకు ఆ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ప్రపంచంలో సమాచార గోప్యత నిబంధనల ఉల్లంఘనల కింద చెల్లించిన అత్యధిక జరిమానాగా ఇది నిలుస్తుంది. అంతేకాదు ఓ ప్రయివేటు ఫిర్యాదును పరిష్కరించుకునేందుకు ఫేస్‌బుక్‌ చెల్లించిన అతిపెద్ద మొత్తం కూడా ఇదే.
      యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సంరక్షించడంలో ఫేస్‌బుక్‌ విఫలమైందని ఈ కేసులో యూజర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సంస్థ అంతర్గత సమాచారాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసి దానికి సంబంధించిన ఆధారాలను వారు సంపాదించారు. దీంతో మెటా వివాదానికి ముగింపు పలకడానికి సిద్ధమైంది. ఒకవేళ విచారణ కోసం పట్టుబట్టి.. కేసులో ఓడిపోయి ఉంటే మెటా ఇంకా భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వచ్చేది. ఈ ముప్పును పసిగట్టి మార్క్‌ జుకర్‌బర్గ్‌ నేతృత్వంలోని సంస్థ ముందే జాగ్రత్త పడింది. యూజర్లు, వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా వెల్లడించింది. మరోవైపు యూజర్ల డేటా రక్షణకు సంబంధించిన విధానాల్ని సమీక్షించినట్టు కూడా పేర్కొంది. అలాగే తాము ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నామో యూజర్లకు స్పష్టంగా చెబుతున్నట్టు తెలిపింది.
అసలు వివాదం ఇది

          గ్లోబల్‌ సైన్స్‌ రీసెర్చి 2014లో ‘దిస్‌ ఈజ్‌ యువర్‌ డిజిటల్‌ లైఫ్‌’ అనే యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిశోధన, విద్యా సంబంధిత అవసరాల కోసం తన వినియోగదారుల సమాచారాన్ని సేకరించేందుకునేందుకు గ్లోబల్‌ రీసెర్చికి ఫేస్‌బుక్‌ అనుమతినిచ్చింది. తర్వాత ఈ డేటాను వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకునేందుకు గ్లోబల్‌ రీసెర్చితో కేంబ్రిడ్జి అనలిటికా ఒప్పందం కుదుర్చుకుంది.
ఇలా అక్రమంగా కేంబ్రిడ్జి అనలిటికా చేతుల్లోకి సమాచారం వెళ్లిన విషయం తొలిసారి 2018లో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌.. ప్రపంచవ్యాప్తంగా 87 మిలియన్ల మంది యూజర్ల సమాచారం అక్రమంగా కేంబ్రిడ్జి అనలిటికా చేతుల్లోకి వెళ్లి ఉండొచ్చని అంగీకరించారు. ఈ ఉదంతం 2018లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికాతో పాటు అనేక దేశాల ఎన్నికలను కేంబ్రిడ్జి అనలిటికా ప్రభావితం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌నకు అనుకూలంగా పనిచేసినట్లు సైతం ఆరోపణలు వచ్చాయి.
       ఈ అక్రమాలను తొలిసారి వెలుగులోకి తీసుకువచ్చిన క్రిస్టోఫర్‌ విలీ 'ఇది పూర్తిగా వ్యక్తుల గోప్యతా నిబంధనల్ని ఉల్లంఘించడమే`నని తెలిపారు. అలాగే, ఈ డేటాను ఓటర్లను ప్రభావితం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని జొప్పించేందుకు వినియోగిస్తున్నారని వెల్లడించారు. భారతదేశంలోనూ పలు పార్టీలు తమ సేవలను ఉపయోగించుకున్నాయని కేంబ్రిడ్జి అనలిటికా గతంలోనే తెలిపింది. దీన్ని ఆధారంగా చేసుకొని కేంద్ర ఐటీ శాఖ.. ఫేస్‌బుక్‌, కేంబ్రిడ్జి అనలిటికాకు నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు నిజమేనని ప్రాథమిక విచారణలో తేలడంతో కేసు కూడా నమోదు చేసింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒక్క బంతికి 18 పరుగులు…
రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .
ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..
క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !
8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి
విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై
ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్
దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు
కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్
తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు
సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట
శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌
100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌
నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన
దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి
ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు
పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి
రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి
నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం
తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి
కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్
ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు
మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ
యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం
18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం
బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.