Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం శనివారం ఉదయం 9గంటలకు ఆన్లైన్ టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 2వ తేదీ నుంచి 11 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. రోజుకు 20వేలు చొప్పున 10 రోజులకు సంబంధించిన మొత్తం 2లక్షల టికెట్లను రేపు (డిసెంబర్ 24) ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. 24న ఉదయం 9 గంటల నుంచి టికెట్లు టీటీడీ వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. టికెట్లు పొందిన వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.