Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐపీఎల్ ఆటగాళ్ల మినీ వేలం తొలి రౌండ్ లో అమ్ముడు కాకుండా మిగిలిపోయిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ కు తదుపరి రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ రూట్ ను కనీస ధరకే కొనుగోలు చేసింది. రూట్ ధర రూ.1 కోటి కాగా, అదే రేటుకు అతడిని దక్కించుకుంది.
అంతే కాకుండా బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ ను రూ.1.5 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. అటు, ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను రూ.1.5 కోట్ల ధరతో రాజస్థాన్ రాయల్స్ కొనేసింది. ఆఖరి రౌండ్ లో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ రిలీ రూసో జాక్ పాట్ కొట్టేశాడు. ఇదేచ తరుణంలో రూసోను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ కుర్ర ఆల్ రౌండర్ శామ్ కరన్ రూ.18.50 కోట్లతో చరిత్ర సృష్టించగా, అతడి సోదరుడు టామ్ కరన్ ను ఒక్కరూ కొనుగోలు చేయలేదు.