Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కొంతమందిని అదృష్టలక్ష్మి వెతుక్కుంటూ వస్తుంటుంది. అలాంటి వారి జీవితాలు రాత్రికి రాత్రే మారిపోతుంటాయి. లక్ష్మీదేవి కరుణించడంతో తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఓగుల అజయ్ అనే డ్రైవర్ కోటీశ్వరుడయ్యాడు. దుబాయ్ లో ఉంటున్న అజయ్ కొన్న లాటరీకి ఏకంగా రూ. 30 కోట్ల జాక్ పాట్ తగిలింది. అజయ్ ది నిరుపేద కుటుంబం. ఆయన తండ్రి కూడా మరణించడంతో తల్లే పెంచింది. నాలుగేళ్ల క్రితం ఉపాధికోసం దుబాయ్ కి వెళ్లాడు. అక్కడ ఒక జెవెలరీ షాప్ లో డ్రైవర్ గా పనికి కుదిరాడు. ఈక్రమంలో 30 దిర్హాములతో రెండు ఎమిరేట్స్ లక్కీ లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు. ఇందులో ఒక టికెట్ కు రూ. 30 కోట్ల జాక్ పాట్ తగిలింది. తనకు లాటరీ తగలడంతో అజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.