Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తిరుమల ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లను శనివారం తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఆన్లైన్లో విడుదల చేసింది. జనవరి 1 నుంచి 11 వ తేదీ వరకు 2.20 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఈ టికెట్లను కొనుగోలు చేయాలని టీటీడీ బోర్డు భక్తులకు సూచించింది. జనవరి 2 న వైకుంఠ ఏకాదశి, 3 న వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని జనవరి 1, నుంచి 11 వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఈ నెల 27 న తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ అనుమతించదు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26 న ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించరని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.