Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. కనికరం లేకుండా అడ్డువచ్చిన వారందరిపై కర్కశంగా దాడులకు పాల్పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా లో ఓ ప్రేమోన్మాది ముగ్గురిపై దాడి చేసి గాయపరిచాడు. కడియం మండలం కడియపు లంక గ్రామంలో వెంకటేశ్ అనే యువకుడు ప్రేమ పేరుతో కొన్ని రోజులుగా యువతి వెంటపడుతున్నాడు. ఆమె నిరాకరించడంతో ఆమె తల్లి, ఇద్దరు కుమార్తెలపై సుత్తితో దాడి చేసి గాయపరిచాడు. అనంతరం వెంకటేశ్ బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.