Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలోని పలు జిల్లాలో ఈ ఏడాది పట్టుబడ్డ గంజాయిని పోలీసులు దహనం చేశారు. గుంటూరు, విశాఖ రేంజ్ పరిధిలో 25 టన్నుల గంజాయిని వివిధ ప్రాంతాల్లో పట్టుకున్నారు. వీటి విలువ సుమారు మూడు వందల కోట్లకు పైగా విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పేరేచర్ల పోలీస్ ఫైరింగ్ రేంజ్లో ఐదు జిల్లాలో పట్టుబడిన గంజాయిని పోలీసులు దహనం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాలు 52 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ యేడాది 146 కేసుల్లో 10.42 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐదు జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. అదేవిధంగా విశాఖ రేంజ్ పరిధిలో ఆరు జిల్లాలో పట్టుకున్న రూ. 300 కోట్ల విలువగల గంజాయి మొక్కలను, గంజాయి పౌడర్ను అనకాపల్లిలో దహనం చేశారు.