Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అశ్వారావుపేట
వ్యవసాయ కార్మిక సంఘం మహా సభలు విజయవంతం కోరుతూ మండలంలో మైక్ ప్రచారం ప్రారంభం అయింది.ఈ ప్రచారం వాహనాన్ని శనివారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కే.పుల్లయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారు మూల గ్రామాల్లో సైతం ఈ మహాసభలు ప్రాధాన్యత తెలియజేయడంతో పాటు భహిరంగ సభకు అధిక సంఖ్యలో జనసమీకరణ చేయడమే లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, వ్యకాస అద్యక్ష,కార్యదర్శులు చిరంజీవి, ముళ్ళగిరి గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.