Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చి మెదక్ మహాదేవాలయం క్రిస్టమస్ వేడుకలకు అందంగా ముస్తాబైంది. రంగు రంగుల విద్యుత్ దీపాలు అమర్చి రాత్రుల్లో మిరుమిట్లు గొల్పేలా మహాదేవాలయాన్ని అలంకరించారు. ఈ క్రిస్టమస్ వేడుకలకు ఇతర జిల్లాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి క్రిస్టమస్ పర్వదినం రోజున ప్రభువును ప్రార్థిస్తారు.ఈ కార్యక్రమం మెదక్ డయాసిస్ రెవరెండ్ జార్జ్ ఎబినెజర్ రాజ్, బిషప్ సాలమోన్ రాజ్ల ఆద్వర్యంలో ఉదయం 4 గంటలకు ప్రత్యేక ఆరాధన ప్రారంభమవుతుంది.