Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సమస్యలేమైనా ఉంటే వాటి పరిష్కారానికి తగు సహకారం అందిస్తామని తెలిపారు. అరణ్య భవన్లో శనివారం మంత్రిని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, కౌన్సిల్ సభ్యులు కలిశారు. న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధికి ప్రతి ఏడాదికి రూ.10 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని, దీంతో నిధిలోని సభ్యులు, మరణించిన న్యాయవాదుల కుంటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వారు మంత్రికి తెలిపారు. వీటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు.