Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కడప నగర మేయర్, వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంధువులు, అనుచరులు వెంటనే కడపలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మెదడులో స్వల్పస్థాయిలో రక్తస్రావం (స్ట్రోక్) అయ్యిందని వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఆయన అసౌకర్యంగా ఉండగా, స్థానిక వైద్యులు పరీక్షించి ప్రమాదమేమీ లేదని చెప్పినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా, జిల్లా నాయకులు ఆయనను పరామర్శించారు.