Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 4,41,42,989 మంది వైరస్ నుంచి కోలుకున్నారని వెల్లడించింది. మరో 5,30,693 మంది మరణించారని, 3424 కేసులు యాక్టివ్గా ఉన్నాయని చెప్పింది. మొత్తం కేసుల్లో 0.01 శాతం కేసులు యాక్టివ్గా ఉండగా, 98.80 శాతం మంది కోలుకున్నారని, 1.19 శాతం మంది మరణించారని వెల్లడించింది. గత 24 గంటల్లో 1,11,304 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని, ఇప్పటివరకు 2,20,05,16,249 కరోనా టీకాలను పంపిణీ చేశామని తెలిపింది.