Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకాశం: గిద్దలూరు మండలం, దిగుమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో భారీ దారి దోపిడీ జరిగింది. నంద్యాల నుంచి నరసరావుపేటకు కారులో వెళ్తున్న బంగారు వ్యాపారులను ఆరుగురు గుర్తుతెలియని దుండగులు బెదిరించి బంగారం, నగదు దోచుకుని పారిపోయారు. కారుతోపాటు కేజీ 700 గ్రాముల బంగారం, రూ. కొంత నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దోపిడీ దొంగలు నల్లమల అటవీ ప్రాంతంలో కిష్టంశెట్టిపల్లి వద్ద కారు వదిలి పెట్టారు. కారు సీటు కింద లాకర్లో ఉన్న కేజీ బంగారం, రూ. 21 లక్షల నగదు సేఫ్గా ఉన్నాయి. కారులో బయట ఉన్న బంగారం ఎత్తుకుపోయారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దుండగుల కోసం గాలిస్తున్నట్లు గిద్దలూరు పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.