Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చైనా నుంచి ఆగ్రా చేరుకున్న ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయనకు సోకింది ఎలాంటి వేరియంట్ అన్న విషయాన్ని తెలుసుకునేందుకు నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్కు పంపినట్లు ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏకే శ్రీవాస్తవ తెలిపారు. చైనాలో పని చేస్తూ ఆగ్రాకు వచ్చిన ఆ వ్యక్తిలో లక్షణాలైతే కనిపించలేదని తెలిపారు.
ప్రస్తుతం అతడిని షాగంజ్లోని ఆయన ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంచినట్టు తెలిపారు. నవంబరు 25 తర్వాత ఇక్కడ వెలుగు చూసిన కేసు ఇదొక్కటేనని, యాక్టివ్ కేసు కూడా ఇదొకటేనని పేర్కొన్నారు. ఇదే తరుణంలో తాజ్మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు అధికారులు టెస్టులు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విదేశీ పర్యాటకులపై అధికారులు దృష్టిసారించారు. యూఎస్, చైనా, జపాన్, బ్రెజిల్, యూరోపియన్ దేశాల నుంచి తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్, అక్బర్ టోంబ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు అక్కడే కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.