Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ను అనుసంధానం చేయని పన్ను చెల్లింపు దారులకు ఆదాయం పన్ను శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఆదాయం పన్నుశాఖ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో తాజా అప్డేట్లో-2017 మే 11న జారీ చేసిన నోటిఫికేషన్ 37/2017 ప్రకారం మినహాయింపు లేని పాన్ కార్డు దారుల్లో ఆధార్తో అనుసంధానించని వారంతా తక్షణం లింక్ చేయాలని, అనుసంధానం చేయని పాన్ కార్డులు ఇన్ఆపరేటివ్-గా మారతాయని తెలిపింది.
పాన్కార్డుతో ఆధార్ అనుసంధానానికి చివరి తేదీ 2023 మార్చి 31. ట్విట్టర్ అధికారిక ఖాతాలోనే ఇదే హెచ్చరికలు జారీ చేసింది. ఇన్కం టాక్స్ యాక్ట్-1961 ప్రకారం పాన్ కార్డు దారులంతా ఆధార్ కార్డును అనుసంధానించాల్సిందేనని ఐటీ డిపార్ట్మెంట్ ట్విట్టర్ హ్యాండిల్ స్పష్టం చేసింది. 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అన్ లింక్డ్ పాన్ కార్డ్ ఇన్ ఆపరేటివ్గా మారుతుంది.