Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో టిప్పర్ వాహనం బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పడంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు బైక్లపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదం ధాటికి వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుడిని స్విగ్గీ డెలివరీ బాయ్ నసీర్గా గుర్తించారు. గాయపడిన వారిలో అబ్దుల్ అనే విద్యార్థికి కాలు విరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.