Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుర్తుతెలియని దుండగుల దాడిలో గాయపడ్డ చేర్యాల జెడ్పీటీసీ శెట్టి మల్లేశం మృతి చెందారు. నగరంలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లేశం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా... ఈరోజు ఉదయం జిల్లాలోని గుర్జకుంట వద్ద వాకింగ్ చేస్తుండగా మల్లేశంపై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. తలకు తీవ్ర గాయాలవడంతో ఆయన అపస్మారకస్థితిలోకి వెళ్లారు. మొదట మల్లేశంను సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తరలించారు. అయితే చికిత్స పొందుతూ మల్లేశం మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.