Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. ఎల్లుండి ప్రధాని మోడీతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను మోడీతో చర్చించనున్నారు. విభజన హామీలను అమలు చేయాలని మరోసారి కోరనున్నారు. రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో మోడీతో జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇంకోవైపు పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలవనున్నారు. కేంద్ర మంత్రులకు సంబంధించి కొందరి అపాయింట్ మెంట్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ నెల మొదటి వారంలో మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు అఖిలపక్ష సమావేశానికి కూడా జగన్ హాజరయ్యారు. ఇటీవల మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా పాల్గొన్నారు.