Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆమె సున్నిపెంట సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్నారు. దీంతో హెలిప్యాడ్ వద్ద ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
ఈ క్రమంలో ముర్ము రోడ్డు మార్గంలో శ్రీశైలం తరలి వెళ్ళి సాక్షి గణపతి ఆలయంలో పూజలు నిర్వహించి, భ్రమరాంబిక అతిథి గృహానికి చేరుకున్నారు. అ తరువాత శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ వేదపండితులు, అధికారులు రాష్ట్రపతికి సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించిన ద్రౌపది ముర్ము, భ్రమరాంబిక అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ప్రత్యేక పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించారు. ఈ తరుణంలో ముర్ము తన పర్యటనలో ప్రసాద్ పథకంలో భాగంగా శ్రీశైలంలో రూ.43.08 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.