Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: మైసూరులో ఈ రోజు(మంగళవారం) మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ గాయపడ్డారు. భార్య, కుమారుడు, కోడలు, మనవడితో కలిసి బండీపురా వెళ్తుంగా ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. మైసూరుకు 13 కిలోమీటర్ల దూరంలో కడ్కోల వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ఆయన కాన్వాయ్ వెంటే ఉంది. ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రహ్లాద్ మోడీ మనవడి కాలు ఫ్రాక్చర్ అయింది. తలకు కూడా గాయాలయ్యాయి. మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారందరినీ మైసూరులోని జేఎస్ ఆసుపత్రిలో చేర్చారు. ధ్వంసమైన కారును బుల్డోజర్ సాయంతో కారును అక్కడి నుంచి తరలించారు.