Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద: నకిలీ మద్యం కేసులో పలువురుని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్రావు తెలిపాడు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడుతో పాటు మరో ఇద్దరని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అయితే నకిలీ మద్యం కేసులో పరారిలో ఉన్నా ప్రధాన నిందితుడు కోండల్ రెడ్డి అలియాస్ శీవరెడ్డిని అదుపులోకి తీసుకోని రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.
దాదాపు కోటి రూపాయలు విలువైన 20 వేల లీటర్ల నకిలీ విస్కీ సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ అని గుర్తు చేశారు. ఒడిస్సాలో తయారుచేసి తెలంగాణ బ్రాండ్ పేరుతోటి నకిలీ మద్యాన్ని విక్రయిస్తోంది ఈ ముఠా. తెలంగాణ నకిలీ లేబుల్ షీట్లు, తయారీ సామాగ్రి, భారీగా నకిలీ మద్యం సీజ్ చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నలుగురిని త్వరలోనే పట్టుకుంటామాని పోలీసులు తెలిపారు. మునుగోడు ఎన్నికలకు తెలంగాణ బ్రాండ్ పేరుతోటి నకిలీ మద్యాన్ని ఈ ముఠా సరఫరా చేసినట్లు గుర్తించారు. ఒడిస్సాలో ఉన్న నకిలీ మద్యం స్థావరంపై దాడులు చేసి ధ్వంసం చేశారు ఎక్సైజ్ పోలీసులు.