Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నేపాల్ దేశంలో బుధవారం తెల్లవారుజామున రెండుసార్లు భూమి కంపించింది. నేపాల్లోని నేషనల్ ఎర్త్క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం బగ్లుంగ్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 4.7, 5.3 తీవ్రతతో బగ్ లుంగ్ జిల్లా చౌర్ చుట్టూ బుధవారం తెల్లవారుజామున రెండు భూకంపాలు 1.23 గంటలకు 4.7 తీవ్రతతో సంభవించాయాని తెలుస్తుంది. ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని నేపాల్ నేషనల్ ఎర్త్క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. గతంలోనూ నేపాల్ దేశంలో పలుసార్లు భూకంపాలు వచ్చాయి.