Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శబరిమల ఆలయంలో ఆదాయం లెక్కించారు. దీంతో గత 39 రోజుల్లో రూ. 222.98 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆలయ బోర్డు ప్రకటించింది. అయితే గత 41 రోజుల్లో 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు సమాచారం.
41 రోజుల మండల పూజ ముగింపు ఉత్సవాన్ని ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన పూజారి (తంత్రి) కందరారు రాజీవర్ నేతృత్వంలో స్వామి విగ్రహానికి బంగారు వస్త్రం అలంకరించారు. అనంతరం కలశాభిషేకం పూజలు నిర్వహించి, రాత్రి భక్తుల దర్శనం ముగిసిన అనంతరం ఆలయాన్ని మూసివేశారు. మకరజ్యోతి ఉత్సవాల(మకరవిలక్కు) కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరువనున్నారు.