Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లో ఖైదీలకు మంచి భోజనం పెడుతున్నాడనే కారణంగా తోటి ఉద్యోగిపైనే దాడి చేశారు జైలు సిబ్బంది. రాయ్ బరేలీలోని జిల్లా జైలులో మెస్ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న ముఖేష్ దూబేపై తోటి ఉద్యోగులే దాడి చేశారు. మెస్ లో మంచి భోజనం పెట్టడం వల్ల తమ క్యాంటీన్ బిజినెస్ దెబ్బతింటోందని వారు ఆరోపిస్తున్నారు.
జైలు లోపల దూబేను చుట్టుముట్టిన ముగ్గురు తోటి ఉద్యోగులు లాఠీలతో చితకబాదారు. మరో ఇద్దరు కొలీగ్స్ పక్కకు నిలబడి ఈ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకురావడంతో ఉన్నతాధికారులు స్పందించి, ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఈ తరుణంలో ముఖేష్ దూబేను ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు.