Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ రైతన్నలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. యాసంగి సీజన్కు సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును నేడు రైతుల అకౌంట్లలో జమచేసింది. తొలిరోజు 21 వేల మందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమయ్యాయని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. పదో విడుత రైతుబంధు ద్వారా 70.54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. తొలిరోజున 1 ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతులకు ఇప్పటికే వారి అకౌంట్లలో రూ.607.32 కోట్లు జమ చేయబడ్డాయి అని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.