Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ ఏడాదిలో చివరి ట్రేడింగ్ సెషన్ను లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు అందుకు దోహదం చేస్తున్నాయి. ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంతో 61,291 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 18,238 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.72 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, ఎల్అండ్టీ, టైటన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, సన్ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.