Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ నిండు నూరుళ్ల జీవితం తర్వాత శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రధాని మాతృమూర్తి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. తల్లిని కోల్పోయి విచారంతో ఉన్న ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మరణించిన వార్త నిజంగా ఎంతో బాధ కలిగిస్తోంది. ఈ కష్ట కాలంలో ప్రధాని మోడీ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, ప్రేమను తెలియజేస్తున్నాను అని రాహుల్ పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ సైతం ట్విట్టర్ లో సంతాపం తెలియజేశారు. హీరాబెన్ అంత్యక్రియలు నేటి ఉదయం గుజరాత్ లోని గాంధీ నగర్ లో పూర్తయ్యాయి.