Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణపేట
నారాయణపేట జిల్లా కోస్గిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్పస్వామిపై బైరి నరేష్ అనే నాస్తికుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. నడిరోడ్డుపై బైరి నరేష్ అనుచరుడు శంకర్పై దాడి చేశారు.
ఈ క్రమంలో నరేష్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప భక్తుల ధర్నాలకు దిగారు. దీంతో బైరి నరేష్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనోభావాలను కించపరిచేలా మాట్లాడేవారిపై చర్యలు తప్పవని, శాంతికి విఘాతం కలిగించేవారిని సమావేశాలు పిలవొద్దని సూచించారు. బైరి నరేష్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి ప్రకటించారు.