Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మీ ఇద్దరిని చూసి, బీజేపీ భయపడదని శివసేన నేత ఆదిత్య ఠాక్రే, ఆయన తండ్రి ఉద్ధవ్ ఠాక్రేపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ విరుచుకుపడ్డారు. 32ఏళ్ల వ్యక్తికి ఈ ప్రభుత్వం భయపడుతోందంటూ ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. 'నిన్ను చూసే కాదు.. నీ తండ్రిని చూసి కూడా ఇక్కడెవరూ భయపడటం లేదు. మీ కళ్లముందు నుంచే 50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి.. మేం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. అప్పుడు ముంబయి కాలిపోతుందన్నారు. కానీ అగ్గిపుల్ల కూడా మండలేదు' అని ఫడణవీస్ తీవ్రస్థాయిలో మాట్లాడారు. అలాగే సిద్ధివినాయక ఆలయ ట్రస్టులో జరిగిన అక్రమాలపై నెలరోజుల్లో విచారణ పూర్తిచేస్తామని వెల్లడించారు.