Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరుగనున్నట్టు బోర్డు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పరీక్షల టైం టేబుల్లో స్వల్ప మార్పు చోటు చేసుకున్నాయి. 12వ తరగతి పరీక్షకు సంబంధించి ఏప్రిల్ 4వ తేదీన జరగాల్సిన ఎగ్జామ్ను మార్చి 27నే నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. మిగతా పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. పదో తరగతి పరీక్షలు 29వ తేదీన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి.