Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రజలంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన వేళ దేశ రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. నూతన ఏడాదిలోకి అడుగిడిన గంటలోనే హర్యానాలో భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీలో భూమికంపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.19 గంటలకు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 3.8గా నమోదయిందని వెల్లడించింది. భూకంప కేంద్రం హర్యానాలోని ఝజ్జర్లో ఉన్నదని చెప్పింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీట్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.