Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కొత్త ఏడాది తొలి రోజే వంటగ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.25మేర పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1973కు, చేరింది. అయితే గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజా పెంపుతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1769కి చేరింది. కోల్కతాలో రూ.1870, ముంబైలో 1721, చెన్నైలో రూ. 1917కి లభిస్తోంది. వరంగల్లో రూ.2014, కరీంనగర్లో రూ.2016.50కి చేరింది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనూ సిలిండర్ ధరలను సవరించారు. విజయవాడలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1947, విశాఖపట్టణంలో రూ. 1819కి పెరిగింది.