Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధర్మదర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతున్నది. కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్లోని బిర్లా మందిర్ భక్తులతో కిక్కిరిసిపోయింది. బాలాజీని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి.