Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నై
డీఎంకేలోని 23 విభాగాలకు ప్రత్యేక ఇన్ఛార్జులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, నీటి వనరుల శాఖ మంత్రి దురైమురుగన్ నియమించారు. ఈ తరుణంలో డీఎంకే ఎంపీ కనిమొళిని ఐదు విభాగాలకు ఇన్ఛార్జిగా నియమించారు. పార్టీలోని పర్యావరణ సంరక్షణ, సాహిత్యం, సాంస్కృతిక, మహిళా, మహిళా కార్యకర్తల విభాగాలకు ఇన్ఛార్జిగా కనిమొళి వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.
ఇదే విధంగా డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, మంత్రి పెరియసామి రైతు, రైతు కూలీ, వైద్య, క్రీడా, సమాచార విభాగాలకు ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. మరో మంత్రి పొన్ముడి ఇంజనీర్లు, వాణిజ్య, చేనేత కార్మికుల విభాగాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. విద్యార్థి, కార్మిక, అసంఘటిత డ్రైవర్లు, న్యాయవిభాగాలకు ఎంపీ రాజా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. జాలర్లు, ఆదిద్రావిడుల సంక్షేమం, మైనారిటీలు తదితర విభాగాలకు పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అందియూరు సెల్వరాజ్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని ప్రకటించారు.