Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రతి ఏడాది డిసెంబరు 31వ తేదీ రాత్రి మద్యం వెల్లువలా ప్రవహిస్తుంది. 2023 సంవత్సరానికి స్వాగతం చెప్పే తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు వైన్ షాపులకు, బార్లకు క్యూ కట్టారు. దీంతో తెలంగాణ, ఏపీల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి.
ఈ క్రమంలో హైదరాబాదులో రూ.37.68 కోట్ల మద్యం అమ్మకాలు జరిగగా తెలంగాణలో కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. బార్లను రాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో మొత్తానికి తెలంగాణలో నిన్న రూ.215.74 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తేలింది.