Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
నాంపల్లిలో నుమాయిష్ ప్రారంభమైన తరుణంలో మెట్రో రైలు సేవలను రాత్రి మరో గంటపాటు పొడిగించి, అర్ధరాత్రి 12 వరకు నడుపుతున్నారు. టర్మినల్ స్టేషన్లయిన ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం నుంచి సాధారణంగా రాత్రి 11 గంటలకే చివరి మెట్రో సర్వీసులు బయలుదేరి వెళ్లిపోతాయి. నుమాయిష్ ముగిసే వరకు చివరి సర్వీసు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరుతుందని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. మియాపూర్-ఎల్బీనగర్(రెడ్ లైన్), నాగోల్ నుంచి రాయదుర్గం(బ్లూ లైన్) కారిడార్లలో మాత్రమే పొడిగింపు ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా నుమాయిష్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ మెట్రో స్టేషన్లో ఉండే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పుడున్న 4 టిక్కెట్ కౌంటర్లను 6కు పెంచారు.