Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యలు ధర్మాసనం నోట్ల రద్దును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్న, వీ సుబ్రమణియన్, బీవీ నగరత్న ఉన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర సర్కార్ తీసుకున్నంత మాత్రాన దాన్ని తప్పుపట్టలేమని సుప్రీం బెంచ్ తన తీర్పులో అభిప్రాయపడింది. నలుగురు సభ్యులు ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు.
జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం మెజారిటీకి వ్యతిరేంగా ప్రభుత్వం ద్వారా కాకుండా పార్లమెంట్ ద్వారా ఆ చర్య చేపడితే బాగుండేదని జస్టిస్ బీవీ నాగరత్న తన అభిప్రాయాల్ని తీర్పులో తెలిపారు. మెజారిటీ న్యామూర్తుల అభిప్రాయాన్ని జస్టిస్ గవాయి వినిపించారు. ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే సమయంలో చాలా సంయమనం అవసరమని ఆయన అన్నారు. న్యాయ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ అభిప్రాయాలు ముడిపెట్టలేమన్నారు. నోట్ల రద్దు అంశంపై కేంద్రం, ఆర్బీఐ మధ్య ఆరు నెలల పాటు సంప్రదింపుల ప్రక్రియ సాగిందన్నారు. నోట్ల రద్దు ప్రక్రియను చేపట్టే వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్బీఐకి లేదని జస్టిస్ గవాయి తెలిపారు.