Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢీల్లి
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే రెండు టూరిస్ట్ హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలోఢీ నలుగురు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గోల్డ్ కోస్ట్లోని సీ వరల్డ్ థీమ్ పార్క్ సమీపంలో గల మెయిన్ బీచ్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలియజేశారు.