Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్ విధానం ఈరోజు (సోమవారం) నుంచి అమలులోకి వచ్చింది. అయితే, ప్రయోగాత్మకంగా పదిహేను రోజుల పాటు ఈ విధానాన్ని సచివాలయంతో పాటు హెచ్ వోడీ, జిల్లా కార్యాలయాల్లో మాత్రమే అధికారులు అమలు చేశారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు బయోమెట్రిక్ హాజరును అమలుచేస్తూ వచ్చిన ప్రభుత్వం ఉద్యోగుల్లో మరింత రెస్పాన్సిబిలిటీని పెంచేందుకు, పారదర్శకత కోసం ఫేషియల్ అటెండెన్స్ను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా దీనిని తప్పనిసరి చేయనుంది. ఇందుకోసం ఐటీ శాఖ ఇప్పటికే తీసుకొచ్చిన అప్లికేషన్ ను ఉద్యోగులు డౌన్ లోడ్ చేసుకుని, రోజూ హాజరు పలకాల్సి ఉంటుంది.